ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల వ్యవహరించిన తీరును సుశాంత్ సింగ్ ఖండించారు. నిజజీవితంలో జరిగిన నేరాల నేపథ్యంలో సావధాన్ ఇండియా షో సిరీస్ కు సుశాంత్ సింగ్ హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముంబైలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సుశాంత్ సింగ్ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్కు షాక్ తగిలింది. దీంతో సుశాంత్ సింగ్ ను స్టార్ భారత్ లో ప్రసారమయ్యే ‘సావధాన్ ఇండియా’ టీవీ షో నుంచి యాజమాన్యం తొలగించింది. సావధాన్ ఇండియా కార్యక్రమంతో తన ప్రయాణం ముగిసిందని సుశాంత్ సింగ్ ట్వీట్ చేశాడు. వాస్తవాలు మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకున్నారా..? అని వ్యక్తి సుశాంత్ సింగ్ ను ప్రశ్నించగా..లేదు తక్కువ మూల్యమే అని బదులిచ్చారు.
previous post