telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

19న చంద్రగిరిలో .. రీపోలింగ్ .. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి .. : ద్వివేదీ

ap election officer altered

దేశంలో ఎన్నికలు ఏడువిడతలుగా జరుగుతున్నాయి. ఆఖరి విడత 19న జరగనుంది. ఈ విడతలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు బూత్ లలో రీపోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ సమీక్షించారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై వారితో చర్చించారు. రీపోలింగ్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ బూత్ ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా బూత్ లలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తగు చర్యలు చేపట్టాలని, ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని అధికారులకు ద్వివేదీ సూచించారు.

Related posts