telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పదవికాంక్ష తో ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు : కోదండరాం

Kodandaram

కోదండరాం మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకోలేదు అని అన్నారు. ఎన్నికల్లో మేము ఓడిపోయిన నైతిక విజయం మాదే. మేము పదవికాంక్ష తో ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉద్యోగుల కు సంబంధించి పీఆర్సీ ,బదిలీలు ,ప్రమోషన్లు పై మేము తీవ్రంగా డిమాండ్ చేసాం. కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పొరాడినం. అధికార పార్టీ పాలన మారకుండా ఇది సాధ్యం కాదని ఎన్నికల ప్రచారంలో విస్తృత ప్రచారం చేసాం. 50 వేల ఉద్యోగాల భర్తీ అని ప్రకటన మేము చెసిన ప్రచారం వల్లే సాధ్యమైంది. ఎన్నికల ముందు 3 రోజులపాటు యాడ్ లకు చేసిన ఖర్చు అందరికి తెలిసిందే. ఎన్నికల కేంద్రాల వద్ద బహిరంగంగా డబ్బులు పంచారు. పోరాడటానికి కావాల్సిన నైతిక బలం మాకుంది. మేధావులు,చదువుకున్న వారు మౌనం వహించడం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వానికి రాబోయే రోజులు అన్ని గడ్డు గడువులే అని ఆయన పేర్కొన్నారు.

Related posts