ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజధాని అమరావతికి చెందిన ఓ మహిళ సవాల్ విసిరారు. ఇటీవల సంభవించిన వరదలకు అమరావతిలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని… ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బొత్సకు సవాల్ విసిరారు.
వరదలకు అమరావతి ప్రాంతం మునిగిందని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రాజధాని మునుగుతుందని నిరూపిస్తే.. తనకు తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ విసిరారు. బాధ్యత గల మంత్రి బొత్స.. అమరావతి రాజధానికి అనుకూలం కాదు అని ఆనాడే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలనే కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.