telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మరణించారు. మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. తైతుంగ్‌కు వెళుతున్న రైలు హువాలియన్‌ స్టేషన్‌కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సరిగా పార్క్‌ చేయని ఓ ట్రక్కు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తైవాన్‌ అధికారిక మీడియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఆ ట్రక్కు పట్టాల పైకి జారడంతో రైలు దాన్ని ఢీకొని పట్టాలు తప్పినట్లుగా వెల్లడించింది. సొరంగంలో చిక్కుకుపోయిన రైలు కోచ్‌ల నుంచి 80 నుంచి 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related posts