telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య… ట్విస్ట్ ఇచ్చిన దేవరాజ్ …!

Shravani

ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. కాగా శ్రావణి బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు కలకలం రేపుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజ్ అనే వ్యక్తే అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. దేవరాజ్ కు శ్రావణి సీరియల్ అవకాశాలు ఇప్పించిందని, అయినప్పటికీ శ్రావణిని అతడు వేధించేవాడని, వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఈ ఘటనపై తాజాగా దేవరాజ్ స్పందించారు. శ్రావణి చావుకు సాయి అనే వ్యక్తి కారణమని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శ్రావణినే స్వయంగా తనకు కాల్ చేసి చెప్పిందని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడం వల్లే తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో శ్రావణితో డిన్నర్ చేస్తున్న సమయంలో సాయి వచ్చి ఆమెపై చేయి చేసుకున్నాడని తెలిపాడు. సాయి, శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను కొట్టి హింసించేవారని వెల్లడించాడు. గతంలో కూడా శ్రావణి కుటుంబ సభ్యులు తనపై కేసు పెట్టారని ఆ తరవాత కూడా తాము కలుసుకున్నామని దేవరాజ్ చెప్పాడు. ఇదిలా ఉండగా గత ఎనిమిది సంవత్సరాల నుండి శ్రావణి టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె మౌన రాగం, మనసుమమత తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తోంది.

Related posts