telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పుట్టలో పాములా… చంద్రబాబు టీడీపీలో చేరాడు…

Ambati Rambabu ycp

ఎన్టీఆర్.. టీడీపీ ప్రారంభిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు చేరిన వ్యక్తి చంద్రబాబు అని.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పార్టీగా టీడీపీ మిగలనుందని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. చంద్రబాబు ఎవరిచ్చారు అధికారం అంటున్నాడు..నీకు ఎవరిచ్చారో మాకు వారే ఇచ్చారని చురకలు అంటించారు. టీడీపీ హయాంలో 132.31 శాతం అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని.. రాష్ట్రమే కాదు దేశమే సంక్షోభంలో ఉంది…ప్రజల సంక్షేమం కోసం అప్పులు తెచ్చామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా చంద్రబాబు హక్కు లేదని… ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బతికిస్తుందా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. ప్యాకెజి కి ఒప్పుకుని హోదా నిట్ట నిలువునా ముంచింది నువ్వు కాదా ? ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని అంబటి స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయాల్లో ఇక హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి..పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచాడని ఆయన సీఎం అవుతాడు అని అంబటి అన్నారు. జూనియర్ ఎన్ఠీఆర్ వస్తున్నాడు అనే ప్రచారం అంటే చంద్రబాబుకి చేతకాదనేగా అర్థమని.. చంద్రబాబు చేతిలో ఆ పార్టీ అంతం కావడం ఖాయం..తమ్ముళ్లు వేరే దారి చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు అంబటి రాంబాబు.

Related posts