జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుముశారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఉ
దయం తీవ్ర అస్వస్థతకు లోనైన సుదర్శన్ రావు.. కొద్ది నిమిషాల్లోనే మరణించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రావు గతంలో రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు.
వ్యాపార రంగంలో స్థిరపడిన సుదర్శన్ రావు… తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నాడు. అయితే అనసూయ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేశారని అనసూయ చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. అనసూయ ముందుగా ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసి ఆ తరువాత యాంకర్ గా మారింది. మాటల్లో ఆమె చాతుర్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తనదైన స్టైల్, నటనతోనూ అందరిని మెప్పించింది అనసూయ.
తండ్రి మరణంతో… యాంకర్ అనసూయ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
ప్రస్తుతం అనసూయ “పుష్ప” సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. దీంతోపాటే ‘ఆచార్య’, ‘భీష్మ పర్వం’, ‘ఖిలాడి’, ‘పక్కా కమర్షియల్’,’ రంగ మార్తాండ’ సినిమాల్లో నటిస్తోంది.
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు