తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకున్న తెలుగమ్మాయి అంజలి. తాజాగా విజయ్ సేతుపతి, అంజలి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “సింద్బాద్”. ఈ చిత్రం శుక్రవారం విడుదల కావాల్సివుండగా… కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల గురించి, ఇతర విషయాల గురించి అంజలి మీడియాతో ముచ్చటించారు. “సింద్బాద్” చిత్రంలో తనను ఓ ముఠా కిడ్నాప్ చేస్తుందని, వారి వద్ద నుంచి విజయ్సేతుపతి ఎలా తనను కాపాడారన్నదే చిత్ర కథాంశమని చెప్పింది. “విజయ్ సేతుపతితో నాకు ఇది రెండవ చిత్రం. ఆయన మంచి ఎనర్జిటిక్ నటుడు. ఒక్కొక్క చిత్రానికి ఆయన ఎదుగుదల కనిపిస్తుంది. వాళ్ల అబ్బాయి సూర్య కూడా ఈ చిత్రంలో తండ్రికి తగ్గ నటుడిగా నటించాడు. ప్రస్తుతం మాధవన్, అనుష్కలతో పాటు ‘సైలెన్స్’ అనే త్రిభాషా చిత్రంలోను, తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో మరో చిత్రంలోను నటిస్తున్నాను. బాలీవుడ్కు వెళ్లాలన్న ఆశ ప్రస్తుతానికి లేదు. టాలీవుడ్, కోలీవుడ్లో మాత్రం తెలిసిన వాళ్లతో నటించేందుకు ఇష్టపడుతున్నాను. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆశ కూడా లేదు. తెలిసిన పని మాత్రమే చెయ్యాలన్నది నా సిద్ధాంతం. ఇప్పటికీ నటనపై మాత్రమే దృష్టి పెట్టాను. వివాహ ఆలోచన ఇప్పట్లో లేదు’” అని తెలిపింది.
previous post
కంగనాపై శివసేన నేత తీవ్ర వ్యాఖ్యలు