గాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్సలో. ఇందులో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలు పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు, పోస్టర్, అందరిని ఆకట్టుకున్నాయి. తాజాగా నాలుగవ సింగిల్ “రివోల్ట్ ఆఫ్ భీమ్” రిలీ చేశారు మేకర్స్. `భీమా.. నిను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన చెట్టు సేమ.. పేరుపెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా?` అంటూ ప్రారంభమైన ఈపాటను శుద్దాల అశోక్ తేజ్ రచించారు.
కీరవాణి తనయుడు సింగర్ కాలభైరవ మెస్మరైజ్ వాయిస్ తో ఈ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకొంటుంది.. ‘కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో..’ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది.చివర్లో పుడమి తల్లికి జన్మ.. మరణమిస్తివిరో అన్న లైన్ వింటుంటే.. భీమ్ యుద్ధంలో వీర మరణం పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
ఈ సినిమాలోఅజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ సినిమా.
సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారాం: రాజశేఖర్