telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాపై శివసేన నేత తీవ్ర వ్యాఖ్యలు

Kangana

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వచ్చే సెప్టెంబర్ 9 వ తేదిన తానూ ముంబై వస్తున్నానని, అక్కడకి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ట్వీట్ చేసింది. తాజాగా కంగనా గురించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఆమె ఒక మెంటల్ కేసు అని అన్నారు. తిన్న పళ్లెంలోనే ఉమ్మేసే రకం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనాను తాము బెదిరించామని ఆమె చెప్పుకుంటోందని… తాము ఎవరినీ బెదిరించమని అన్నారు. ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. ఆమె వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. 1992లో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు నగర పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి జనాల ప్రాణాలను కాపాడారని సంజయ్ చెప్పారు. కరోనా వైరస్ సమయంలో విధులు నిర్వహిస్తూ పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. హీరో సుశాంత్ మరణం కేసు విచారణలో ముంబై పోలీసుల చిత్తశుద్ధిని కించపరుస్తూ కంగనా మాట్లాడుతోందని సంజయ్ దుయ్యబట్టారు. రానురానూ కంగనా రనౌత్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మధ్య వివాదం ముదురుతోంది.

Related posts