“అర్జున్రెడ్డి” సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా “కబీర్సింగ్” పేరుతో హిందీలోకి రీమేక్ అయ్యి అక్కడా సంచలనం సృష్టించింది. ఎంత భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిందో.. అంతే స్థాయిలో విమర్శలనూ మూటకట్టుకుంది. ఈ రెండు సినిమాలనూ రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డిపై మహిళా వాదులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా హైదరాబాద్లో వైద్యురాలిపై జరిగిన హత్యోదంతంపై స్పందిస్తూ దర్శకుడు సందీప్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. “సమాజంలో ఇలాంటి దారుణ ఘటనలను ఆపాలంటే భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షిస్తే.. ఇలాంటి ఆలోచనలు చేయడానికే వణుకు పుడుతుంది. దేశంలోని ప్రతీ అమ్మాయికీ భరోసా కల్పించాలి” అంటూ సందీప్ ట్వీట్ చేశాడు. సందీప్ ట్వీట్పై పలువురు విమర్శలు చేస్తున్నారు. `కపటత్వం` అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. `మీరు చెబుతున్న భయం.. మీ సినిమాలోని ఆమెను కొట్టకుండా ఆపగలిగిందా` అని ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య ట్వీట్ చేశారు. `మహిళలపై హింసను ప్రేరేపించేలా కాకుండా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నించండ`ని పలువురు ఆయనకు సూచనలు చేస్తున్నారు. ఈ ట్వీట్లపై సందీప్ స్పందించలేదు.
previous post
next post