ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో అలల ఉద్ధృతికి.. ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు.
జొవాద్ తుఫాన్ నేపథ్యంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. నయీమ్ నీటిలో కొట్టుకుపోతుండగా..పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. గజ ఈత గాళ్ల ద్వారా ఆ వ్యక్తిని కాపాడారు.
అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి.. అబ్దుల్ను కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.