* ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు పూర్తి
*పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించిన గ్రామస్థులు
*అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు..
* అభిమాన నేతకు చూసేందుకు పొటేత్తిన ప్రజలు..
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో ఆయన బంధువులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి