telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

Giddalur YSRCP MLA

ఏపీలో కరోనా వైరస్ అందరిని టచ్ చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కోవిడ్ భారినపడుతున్నారు. తాజాగా తాజాగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో తన భార్యతో కలిసి ఒంగోలులోని రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ గా తేలింది. ఇటీవలే ఎమ్మెల్యే పుట్టినరోజు జరిగింది. ఈ వేడుకలో ఆయన పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.

Related posts