ఏపీ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు గుంటూరులో స్వచ్ఛందంగా బంద్ జరుగుతోంది. గుంటూరులోని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆందోళనకారులు బస్టాండ్ వద్ద ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడుదామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాల తర్వాత తమకు మరింత ధైర్యం వచ్చిందని, పట్టుదల పెరిగిందని తెలిపారు.కీలక సమయంలో పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తీరును రైతులు తప్పుపట్టారు. మరోవైపు బంద్ కు ఎటువంటి అనుమతులు లేవని గుంటూరు అర్బన్ ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు:నారాయణ