telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కన్నా ఇంటి ముందు..టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం

 కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా శనివారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో టీడీపీ ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఈ పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు.

Related posts