telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబే రాష్ట్రానికి పట్టిన వైరస్ : కన్నబాబు

Ycp Kannababu

ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… చంద్రబాబు  ఎక్కడా సిగ్గు పడడం లేదు. ఒక విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలు చెయకూడదన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేదు. కర్నూలులో భయంకరమైన వేరేంట్ వచ్చిందని దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు మన వైపు అదోలా చూస్తున్నారు. ఒక టెర్రరిస్టుల ప్రజలను భయబ్రాంతులకు గురు చేస్తున్నాడు. చంద్రబాబే రాష్ట్రానికి పట్టిన వైరస్ అని తెలిపారు. జూమ్ లో కూర్చుని పెద్ద సైంటిస్ట్ లా ఫోజు కొడుతున్నాడు. సీఎం జగన్ కు చెడ్డ పేరు రావాలని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకవైపు వైరస్ ను ఎదుర్కోంటామా…లేక చంద్రబాబు ప్రచారాన్ని ఎదుర్కోంటామా. చంద్రబాబు మాటలను నమ్మెద్దోన్ని ప్రజలను కోరుతున్నా. చంద్రబాబు కు వ్యాక్సినేషన్ పై నిజాలు తెలియదా?… కేంద్రమే ఏ రాష్ట్రానికి ఎంత  వ్యాక్సిన్ ఇవ్వాలో  ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దం గా ఉంది. రాష్ట్రానికి కావాల్సిన టీకాలు ఇప్పించగలిగితే రూ. 1600 కోట్లు మీ ఎకౌంట్లో వేస్తాం అని పేర్కొన్నారు.

Related posts