అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు.
రాజధాని అంశం కోర్టుల పరిధిలో ఉన్న సమయంలో న్యాయస్థానాలను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోందని కనకమేడల మండిపడ్డారు.
కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసని అన్నారు. కావాలనే న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని దుయ్యబట్టారు. పేదలకు భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కట్టించిన దాదాపు 6 లక్షల ఇళ్లను ఎందుకు పంచలేదని ప్రశ్నించారు.