telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం

jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్‌.జగన్‌ తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో భేటీ అవుతున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈరోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండురోజులపాటు జరిగే ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలిరోజు ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పాఠశాల విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, పౌరసరఫరాల, వ్యవసాయం, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, విద్యుత్‌, మంచినీరు, నిరుపేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాల్లో ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి వివరాలు రాబట్టనున్నారు. త్వరలో బడ్జెట్‌ సమావేశం జరగనుండడంతో ఈ సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని అధికారుల నుంచి సేకరించి నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది.

Related posts