telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో పెరిగిన కరోనా కేసులు…

ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 91,120 శాంపిల్స్ పరీక్షించగా 18,285 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 99 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 24,105 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,27,390 కి చేర‌గా.. యాక్టివ్ కేసులు 1,92,104 గా ఉన్నాయి.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 14,24,859 క‌రోనా నుంచి కోలుకోగా 10,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,88,40,321 కు చేరింది.

Related posts