telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నా… సీనియర్ హీరోయిన్

bhagyashree

ప్రభాస్ కథానాయకుడిగా పూజ హెగ్డే కథానాయికగా రాధాకృష్ణ కుమార్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘ ఓ డియర్’… ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో, బాలీవుడ్ కి చెందిన నటీనటులు కొందరు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆమె నిజంగానే చేస్తుందా ? లేదంటే పుకారు మాత్రమేనా? అనే అయోమయం అభిమానుల్లో నెలకొంది. దాంతో తాజాగా ఈ సినిమాను గురించి భాగ్యశ్రీ స్పందించారు. ‘నిజమే .. నేను ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నాకు సంతృప్తిని ఇచ్చే పాత్ర ఇది. ఇంతవరకూ నేను చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటి అవుతుంది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా వుంది” అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు.

Related posts