వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న క్రేజీ డైరెక్టర్ తేజ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్టికల్ 370 రద్దు అంశం మన దేశంలో ప్రకంపనలు సృష్టించింది. రద్దు వలన జమ్మూకశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఇప్పుడు ఆర్టికల్ 370 అంశాన్ని తీసుకొని బాలీవుడ్ సినిమా చేయాలని తేజ కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కథ రాసుకున్న తేజ గోవాలో కథకి సంబంధించి ప్రీ ప్రోడన్ పనులు చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాత చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఆర్టికల్ 370పై బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సినిమా చేస్తారని అభిమానులు భావించగా, తెలుగు దర్శకుడు ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తుండడం గొప్ప విషయం అని నెటిజన్స్ అంటున్నారు. తేజ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో సీత అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
next post
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు