మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా టర్ పెట్రోల్పై 23.26 పైసలు, డీజిల్పై 28.30 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.73కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ.79.35 కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 95.46, డీజిల్ రూ. 86. 34 కి చేరాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.53 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 86.55 కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 91.19 పెరగగా.. డీజిల్ రూ. 84. 44 కు చేరుకుంది. కోల్కతా పెట్రోల్ రూ. 90. 25 పెరగగా.. డీజిల్ రూ. 82.94కు చేరుకుంది. అటు జైపూర్లోనూ పెట్రోల్ రూ. 93.98 కి పెరరగా.. డీజిల్ రూ. 85. 95 కు చేరుకుంది. కాగా.. ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.
previous post
కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది: ఎంపీ కోమటిరెడ్డి