కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణానికి కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆయన నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ సమయంలో ఊపిరాడని పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని వైద్యులు రిపోర్టును అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఆత్మహత్యకు ముందు తాను పారిశ్రామికవేత్తగా విఫలమయ్యానని కంపెనీ బోర్డు, ఉద్యోగులను ఉద్దేశించి సిద్ధార్థ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ సంతకంతో ఆయన వ్యక్తిగత లెటర్ హెడ్ పై ఈ లేఖ రాసినప్పటికీ అది ఆయనే రాశారా? అన్న విషయంపై ఇప్పటికీ అనుమానాలున్నాయి.