గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇవాళ్టితో నామినేషన్లు కూడా ముగియనున్నాయి. ఈసారి గ్రేటర్ పరిధిలో సీఎం కేసీఆర్ ఓ ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, గతంలో మాదిరిగానే.. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. విస్తృతంగా ప్రచారంలో పాల్గొననున్నారు.. ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్లో రోడ్షోలు నిర్వహించనున్నారు కేటీఆర్… కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ బహిరంగ సభ ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉండగా… దీనిపై కేసీఆర్ ఇవాళ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
previous post
next post