దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు 23.48 శాతం పోలింగ్ నమోదయింది.
బీహార్ 18.26, జమ్మూ కాశ్మీర్ 3.74, జార్ఖండ్ 29.21, మధ్యప్రదేశ్ 26.62, మహారాష్ట్ర 16.47, ఒడిశా 19.67, రాజస్తాన్ 29.19, యుపి 21.18, బెంగాల్ 35.10 శాతం గా పోలింగ్ అయింది. పశ్చిమ బెంగాల్లో కొంత అలజడి చోటు చేసుకుంది. చెదురు మొదురు ఘటనల మినహా, దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.