telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగింది: ట్రంప్

trump usa

కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. చైనా సహా ఎవరికీ లేనంతటి గొప్ప ఆర్థిక వ్యవస్థ అమెరికా సొంతమని అన్నారు. వైరస్ రూపంలో అకస్మాత్తుగా తగిలిన దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత డబ్బు ఖర్చు చేయక తప్పడం లేదన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 8.80 లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మరణాలు 50 వేలకు చేరువయ్యాయి. 85 వేల మందికిపైగా కోలుకున్నారు.

అగ్రరాజ్యంలో కరోన మహమ్మారి తగ్గినట్టే తగ్గి చాపాకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ బారినపడిన వారిలో నిన్న మళ్లీ 2,416 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడో రోజు 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాకున్నా కేసుల సంఖ్యలో కొంత తగ్గుముఖం కనిపిస్తోంది. కరోనా బారి నుంచి ఒక్కో రాష్ట్రం కోలుకుంటోందని ట్రంప్ పేర్కొన్నారు.

Related posts