ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీలకు వెళ్లే దారుల్లో ఇప్పటికే మూడు గేట్లను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు గేట్లను కూడా మూసివేశారు. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత, ఈ ప్రాంతంలోని రైతులు నిరసనలకు దిగిన వేళ అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లే గేట్లను గతంలో మూసి వేశారు.
సచివాలయం, శాసనసభకు వెళ్లే గేట్లలో కొన్నింటిని తొలగించాలని వాస్తు పండితులు నిర్ణయించడంతో గెట్లను మూసివేశామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ సంవత్సరం జనవరి 20న అమరావతి రైతులు ‘చలో అసెంబ్లీ’ నిర్వహించగా, సీఎం బ్లాక్ నంబర్ 1 వరకూ పలువురు రైతులు, మహిళలు రావడం, వారిని అడ్డుకునే మార్గాలు పోలీసులకు తెలియక పోవడంతో ఆపై ప్రభుత్వం ఒకొక్క గేట్ నూ మూసివేస్తూ వచ్చింది.