telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సెక్రటేరియేట్ లో మరో రెండు గేట్ల మూసివేత!

AP Secretariate walls

ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీలకు వెళ్లే దారుల్లో ఇప్పటికే మూడు గేట్లను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు గేట్లను కూడా మూసివేశారు. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత, ఈ ప్రాంతంలోని రైతులు నిరసనలకు దిగిన వేళ అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లే గేట్లను గతంలో మూసి వేశారు.

సచివాలయం, శాసనసభకు వెళ్లే గేట్లలో కొన్నింటిని తొలగించాలని వాస్తు పండితులు నిర్ణయించడంతో గెట్లను మూసివేశామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ సంవత్సరం జనవరి 20న అమరావతి రైతులు ‘చలో అసెంబ్లీ’ నిర్వహించగా, సీఎం బ్లాక్ నంబర్ 1 వరకూ పలువురు రైతులు, మహిళలు రావడం, వారిని అడ్డుకునే మార్గాలు పోలీసులకు తెలియక పోవడంతో ఆపై ప్రభుత్వం ఒకొక్క గేట్ నూ మూసివేస్తూ వచ్చింది.

Related posts