telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ నటి ఆత్మహత్యకు అసలు కారణం ఆ ఫొటోలే… ?

Shravani

ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. మౌనరాగం సీరియల్ నటి శ్రావణి సూసైడ్ చేసుకోవడంతో బుల్లితెర ప్రేక్షక లోకం షాకైంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. కాగా శ్రావణి బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు కలకలం రేపుతున్నాయి. ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరీర్‌ సాఫీగా సాగిపోతున్న వేళ కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్‌టాక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, అయితే ఆ తర్వాత సదరు యువకుడు శ్రావణిని వేధించి ఈ మరణానికి కారణమయ్యాడని వారు ఆవేదన చెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ శ్రావణితో టిక్ టాక్‌లో పరిచయం ఏర్పరచుకొని బాగా దగ్గరయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెలిగారు. అయితే గత కొన్ని రోజులుగా సదరు యువకుడు డబ్బు కోసం శ్రావణిని వేధిస్తున్నాడని, డబ్బు ఇవ్వలేదంటే తమ సన్నిహిత ఫోటోలను బయటపెడతానని హెచ్చరించడం కారణం గానే శ్రావణి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రావణి మరణానికి కారణమైన ఆ యువకుడికి తగిన శిక్ష విధించాలని కోరారు. ఈ మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజు రెడ్డిపై SR నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

Related posts