ఏపీ లో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 50, విదేశాల నుంచి వచ్చిన నలుగురు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 84 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,250 కేసులు నమోదయ్యాయి.
తాజాగా కరోనా వల్ల మరో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు కరోనా మరణాలు కూడా కృష్ఝా జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 73కు పెరిగింది. శుక్రవారం 21 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కొలుకొని మొత్తం 2,294 మందికి డిశ్చార్జ్ అయ్యారు.