ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డాడు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పాడుపనులు అని విమర్శించారు. మాట తప్పనన్నాడు, మడమ తిప్పనన్నాడు. ప్రతిసారి ముందు చెప్పిందొకటి, తర్వాత చేసేదొకటి అంటూ ట్వీట్ చేశారు.
అంతేకాదు, పార్టీ ఫిరాయింపులపై గతంలో జగన్ సంతలో పశువుల్లా కొంటున్నారన్న వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ ను కూడా అచ్చెన్న పోస్టు చేశారు. ఇటీవల టీడీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వెళుతున్న నేపథ్యంలోనే అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే అంటున్న మహారాష్ట్ర సీఎం…