telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కూకట్‌పల్లి బస్టాప్‌ వద్ద 27మంది మహిళల అరెస్టు

SIT Investigation YS viveka Murder

 సిటీ బస్టాప్‌ ల వద్దకు వచ్చే ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వ్యభిచారానికి ప్రేరేపిస్తున్న 27మంది మహిళలను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. .ఎస్సై నారాయణసింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం… కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్‌కాలనీ బస్టాప్‌ వద్ద కొంతమంది మహిళలు రాత్రి పూట న్యూసెన్స్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఏసీపీ సురేందర్‌రావు, సీఐ ప్రసన్నకుమార్‌ ఆదేశాలతో ఎస్సై రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు. రాత్రి 9నుంచి 12 గంటల వరకు బస్టాప్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేసి 27మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రిమాండ్‌కు తరలించారు. సమస్యాత్మకంగా ఉన్న బస్టాప్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఐ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Related posts