కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేయకపోగా అభివృద్ధిని అడ్డుకుందని మంత్ర పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లాలోని రామగిరి మండల కేంద్రంలో నిరసన దీక్షలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ .. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతికి వచ్చి మోదీ మట్టీ, నీరు మన మొహాన పదేశారని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు దేశం మొత్తం మద్దతు తెలుపుతోందని, ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత జగన్ ఏ ఒక్క రోజూ మాట్లాడలేదు. అంతే కాకుండా ఆదివారం ప్రధాని మోదీ గుంటూరుకు వస్తే జగన్ తన పార్టీకార్యకర్తల్ని ఆ సభకు పంపించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాకు కియా వంటి పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత చంద్రన్నదని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సునీత అన్నారు. కేంద్రం సహకరిస్తే మరిన్ని సంక్షేమాలు పేదలకు వచ్చేవని ఆమె వెల్లడించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ