telugu navyamedia
రాజకీయ

పంజాబ్‌లో క్లీన్ ‘స్వీప్’ దిశ‌గా ఆమ్​ ఆద్మీ పార్టీ

*పంజాబ్ ఆప్‌ అఖండ విజ‌యం
*బీజేపీ కాంగ్రెస్ ను చీపురుతో ఊడ్జేసిన ఆప్‌
*ఢిల్లీలో ఆప్‌ కార్యకర్తల సంబరాలు..
*మ్యాజిక్ ఫిగ‌ర్ దాటిన అమ్ ఆద్మీ పార్టీ..
*మెజార్టీ సీట్లు ద‌క్కించుకున్న ఆప్‌

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆమ్​ ఆద్మీ పార్టీ బంపర్‌ మెజారిటీ సాధించి అధికారం దిశగా దూసుకెళుతోంది. దీంతో అటు పంజాబ్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పంజాబ్‌లో 90 స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 11 సీట్లలోనే ముందంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది..

Related posts