పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ను వీడిన అమరీందర్.. కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. పార్టీ అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ను వీడిన ఆయన తొలుత భాజపాలో చేరతారనే ప్రచారం జరిగింది. చివరకు కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన అమరీందర్ ఓటమి పాలవ్వడం గమనార్హం.
తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి