telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పృథ్వీ తొందరపడి వ్యాఖ్యలు చేశారు: పోసాని

ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన వ్యక్తి, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వీరాజ్ తొందరపడి ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలు “బిగ్ మిస్టేక్ “గా అభివర్ణించారు.

సీఎం అయిన జగన్ ని కలిసి, ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే పొరపాటేనని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని, అప్పుడు తానేమి చంద్రబాబును కలిసి అభినందించలేదని, అంటే, చంద్రబాబు సీఎం కావడం తనకు ఇష్టం లేదని అనుకోవడం కరెక్టు కాదు అని అన్నారు.

Related posts