telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇస్రో ఛైర్మన్ కి బెదిరింపులు .. మోడీకి మద్దతు ఇవ్వొద్దు .. : జైషే ఉగ్రవాద సంస్థ

terrorist warning to isro chairmen on supporting modi

ఇస్రో మాజీ చైర్మన్, బీజేపీ నేత మాధవన్ నాయర్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతివ్వొద్దంటూ .. బెదిరిస్తూ ఓ లేఖ వచ్చినట్టు సమాచారం. తమ హెచ్చరికలను కాదని మోదీకి మద్దతిస్తే మాధవన్ నాయర్ ని చంపేస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈ లేఖను పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్టు పేర్కొన్నాయి. ఈ లేఖ విషయమై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, 2003-2009 వరకు ఇస్రో చైర్మన్ గా మాధవన్ నాయర్ వ్యవహరించారు. మాధవన్ నాయర్ కు పలు పురస్కారాలు లభించాయి. గత ఏడాది అక్టోబర్ లో బీజేపీలో మాధవన్ నాయర్ చేరారు.

Related posts