ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయంలో మొదటినుంచి వాస్తు దోషం ఉన్నట్టు విమర్శలు వెళ్ళు విరుస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు హయాంలోనూ అనేక మార్పులు చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎంగా జగన్ వచ్చాక కూడా పలు వాస్తు లోపాలను గుర్తించారు. ఈ మేరకు సచివాలయంలో యుద్ధప్రాతిపదికన వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం. సచివాలయం మొదటి బ్లాక్ లో వాస్తు మార్పులు చేయాలని వైసీపీ నేతలు సూచించినట్టు ఇటీవలే కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలో సీఎం చాంబర్ లోకి వెళ్లే ఒక ద్వారాన్ని మూసివేయాలని నిర్ణయించారు. అంతేగాకుండా, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చాంబర్ లోనూ ఆగ్నేయ మూల వద్ద మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ వాస్తు లోపాల దృష్ట్యా సీఎం జగన్ ఈ రోజు సచివాలయ ప్రవేశాన్ని ఆఖరు క్షణాల్లో రద్దు చేసుకున్నట్టు సమాచారం.
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్