telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ సచివాలయంలో వాస్తు లోపాలు.. ఒక ద్వారం మూసివేత?

machilipatnam as ntr district by jagan

ఏపీ రాజధాని అమరావతిలో  నిర్మించిన సచివాలయంలో మొదటినుంచి  వాస్తు దోషం ఉన్నట్టు  విమర్శలు  వెళ్ళు విరుస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు హయాంలోనూ అనేక మార్పులు చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎంగా జగన్ వచ్చాక కూడా పలు వాస్తు లోపాలను గుర్తించారు. ఈ మేరకు సచివాలయంలో యుద్ధప్రాతిపదికన వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం. సచివాలయం మొదటి బ్లాక్ లో వాస్తు మార్పులు చేయాలని వైసీపీ నేతలు సూచించినట్టు ఇటీవలే కథనాలు వచ్చాయి.

 ఈ క్రమంలో సీఎం చాంబర్ లోకి వెళ్లే ఒక ద్వారాన్ని మూసివేయాలని నిర్ణయించారు. అంతేగాకుండా, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చాంబర్ లోనూ ఆగ్నేయ మూల వద్ద మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ వాస్తు లోపాల దృష్ట్యా సీఎం జగన్ ఈ రోజు సచివాలయ ప్రవేశాన్ని ఆఖరు క్షణాల్లో రద్దు చేసుకున్నట్టు సమాచారం.

Related posts