ప్రచారం కోసమే ప్రభుత్వం స్కూళ్లను తెరుస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగనన్న బూట్లు, బట్టలు ఇచ్చేందుకు వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లను తెరుస్తామని ప్రకటిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లను తెరిచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు.
ప్రభుత్వం తాము ఇచ్చిన భూములకు కౌలు చెల్లించలేదని అమరావతి రైతులు నిరసన చేపడితే పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని అన్నారు. ఎంతో అనుభవం ఉన్న రామచంద్రమూర్తి సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని రఘురాజు అన్నారు. డాక్టర్ రమేశ్ ను వేధిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. ఆయన సామాజికవర్గాన్ని సూచించేలా పేరు చివరన చౌదరి అని తగిలించి వేధిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేస్తుంటే, తనను రాజీనామా చేయమంటున్నారని రఘురాజు మండిపడ్డారు. తన పార్టీకి చెందిన నేతలు ఇప్పటికీ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలితే మంచిదని హితవు పలికారు.
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి