telugu navyamedia
వార్తలు సామాజిక

ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి తాళికట్టిన యువకుడు

ప్రేమించిన అమ్మాయిని ఒదులుకోలేక, పెద్దలు చూసిన అమ్మాయిని కాదనక ఓ యువకుడు పెళ్లీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. వివరాలలోకి వెళితే, బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ చదువుకుంటున్న సమయంలో ఓ యువతి ప్రేమలో పడ్డాడు. వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగానే, ఈ విషయం తెలియని సందీప్ తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసేందుకు మరో యువతితో సంబంధం కుదుర్చుకున్నారు.

విషయం ప్రేమికురాలికి తెలియడంతో వ్యవహారం గ్రామంలోని రచ్చబండకు చేరింది. సమస్య పరిష్కారం కోసం పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అయితే, ఇక్కడే మరో ట్విస్టు చోటుచేసుకుంది. తామిద్దరం అతడితోనే కలిసి జీవిస్తామని ఇద్దరు యువతులు తేల్చిచెప్పడంతో పెద్దలు కూడా ఎదురుచెప్పలేకపోయారు. ఇద్దరినీ పెళ్లాడేందుకు సందీప్ కూడా ఓకే చెప్పడంతో ఈ నెల 8న కెరియాలో బంధుమిత్రుల మధ్య వివాహం ఘనంగా జరిగింది.

Related posts