తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా కారు దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది.
తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లో సైతం టీఆర్ఎస్ సత్తా చాటింది. కాంగ్రెస్ చేయి ఊపిన కారు దూసుకెళ్తోంది. 12 వార్డులకు గాను 8 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా శ్రమించినా ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు.