telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

టైమ్ స్లాట్ టోకెన్లు, నడకదారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 61,045 మంది భక్తులు దర్శించుకోగా, 20,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.49 కోట్ల ఆదాయం వచ్చింది.

Related posts