రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఓటమి దాదాపు ఖాయం అయిపోయిందని సర్వేలు చెపుతున్నాయి. అలాగే ఇప్పటికే జగన్ సీఎం కాబోతున్నాడని ఆ సర్వేలు చెపుతున్నాయి. అయితే ఇప్పుడు చివరి బ్రహ్మాస్త్రంగా ఒక వ్యూహం రచించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీతో కుమ్మక్కు, కేసీఆర్తో కుమ్మక్కులాంటి అస్త్రాలన్నీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదట. జగన్ లక్ష కోట్లు తిన్నాడు అని చెప్పి కేసీఆర్ దగ్గర వెయ్యి కోట్లకు సాగిలపడ్డాడు అన్న మాటలు టిడిపి నేతలకే కామెడీగా అనిపిస్తున్నాయి. అయితే ఈ చివరి బ్రహ్మాస్త్రం మాత్రం వర్కవుట్ అవుతుందని టిడిపి జనాలు నమ్ముతున్నారు. పొలిటికల్ విశ్లేషకుడు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై పూర్తి అవగాహన ఒక ఎనలిస్ట్ ఆ బ్రహ్మాస్త్రం గురించి సవివరంగా చెప్పుకొచ్చారు.
టీడీపీ ప్రయోగించడానికి సిద్దమైన ఈ బ్రహ్మాస్త్రానికి జగన్తో పాటు వైకాపా జనాలు ఈ చివరి అస్త్రాన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఈ చివరి అస్త్రం వర్కవుట్ అవుతుందా? అని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్న చంద్రబాబు ఫైనల్గా ఈ అస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తారు? నెగిటివ్ అవుతుందని భయపడతారా? చంద్రబాబు ప్రయోగిస్తే జగన్ ఎదుర్కోగలడా? అనే విషయాలపై స్పష్టత లేదు. కానీ చంద్రబాబు వ్యూహంపై మాత్రం చాలానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యూహం గురించి వస్తున్న సమాచారం ఏంటంటే ..!
ఈ అస్త్రం బహుశా, ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగిన చంద్రబాబు గారు.. ఓ సభా వేదికపై మాట్లాడుతూనే తుళ్లి పడిపోతారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది. ఒక వేళ తేదీ మార్పు జరిగితే, ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు గారు.. నడుస్తూ.. నడుస్తూ కింద పడిపోతాడు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన చంద్రబాబు అస్వస్థకు గురవుతారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది.
ఓ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి పక్కనే ఉన్న అంబులెన్స్లో బాబును తీసుకెళ్లిపోతారు. అక్కడ లోపల ఏం జరుగుతుందో చీమకు తెలియదు. కానీ లోపలి నుంచి లీకేజీ మెసేజ్లు వస్తాయి. సన్ స్ట్రోక్ తగిలింది.. చంద్రబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తున్నారని.. అక్కడ నుంచి ఎన్నికల ప్రణాళిక స్కెచ్ గీస్తుంటారు. ఈలోగా మీడియా (ఎల్లో మీడియా చానళ్లు) ఎడతెగని స్క్రోలింగ్లతో క్షణం క్షణం చెవులు తూట్లు పడేలా అప్డేట్స్. ఇదంతాఎలక్షన్కు ముందు రాష్ట్ర ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసి లబ్ధిపొందాలనే కుట్ర, ఇప్పటికే బాబు సంధించాల్సిన అస్త్ర, శస్త్రాలన్నీ అయిపోయాయి. జనమే కాదు.. టీడీపీ అభిమానులు సైతం చంద్రబాబును నమ్మడం లేదు. అందుకే చివరగా ఈ బ్రహ్మస్త్ర ప్రయోగానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..