మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఓడరేవుల వద్ద హైఅలర్ట్ ప్రకటించింది. .60కి పైగా దేశాలకు కరోనా సోకిన నేపథ్యంలో, ఆ వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా పోర్టుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా చైనా నుంచి బయల్దేరిన ఓ కార్గో నౌక పారాదీప్ పోర్టుకు చేరుకుంది. దాన్ని సముద్రంలోనే నిలిపివేసిన పోర్టు అధికారులు.. ఓడలోని వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఎవరికీ కరోనా వైరస్ లేదని తేలినప్పటికీ, వారిని పోర్టులో దిగేందుకు మాత్రం అనుమతించలేదు. మరోసారి వారందరికీ థర్మల్ స్కాన్ చేయిస్తామని, ఆ తర్వాతే పోర్టులో దిగేందుకు వారికి అనుమతిస్తామని పోర్టు అధికారులు తెలిపారు.