telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌ను అందరు బాధ్యతగా పాటించాలి: ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

లాక్‌డౌన్‌ను అందరూ బాధ్యతగా పాటించాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆయన పర్యటించారు. తమిళనాడు నుంచి వలస వచ్చిన కార్మికులకు మంత్రి నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్లు, కొంత నగదును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే జైలుకి పంపుతామని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. నిత్యావసరాల కొరత లేకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు. ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దని తాను చేతులెత్తి వేడుకుంటున్నానని చెప్పారు. గ్రామాల్లోని పరిస్థితులను స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు.

Related posts