telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. కొత్తగా 83,883 మందికి పాజిటివ్

corona covid

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 83,883 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 38,53,407కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 67,376 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 29,70,493 మంది కోలుకున్నారు. 8,15,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 8,25,739 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 17,433 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 25,195గా ఉంది.

మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు మొత్తం 4,55,09,380 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

Related posts