తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 2,123 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 2,151 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,169 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,37,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,025కు చేరింది. ప్రస్తుతం 30,636 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 305 మంది కోవిడ్ బారినపడ్డారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి: చంద్రబాబు