telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర‌ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో జగన్‌ చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, వైఎస్సార్‌ ఆసరా, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌ బ్యాండ్ సేవల అమలు, యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీలకు పోస్టుల మంజూరుపై ఈ మంత్రివర్గ సమావేశంలో‌ ఆమోదం తెలపనున్నారు. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఆమోద ముద్ర పడనుంది.

Related posts