telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆరేళ్ళ కొడుకుని చంపేసిన తల్లి… ఎందుకంటే..?

crime

మదనపల్లెలో ఇద్దరు భార్యాభర్తలు తమ సొంత కూతురును చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే త్వరలో కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ తన ఆరేళ్ల కొడుకును అల్లా బలి చేయమన్నాడు అని భావించి గొంతు కోసి కిరాతకంగా చంపింది ఆ కన్నతల్లి.. వినడానికి జుగుప్సాకరంగా ఉన్న ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే కేరళలోని పాలక్కాడ్ లో సులేమాన్, షాహీన్ అనే దంపతులు నివసిస్తున్నారు. సులేమాన్ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తుండగా షాహీనా దగ్గర్లోని మదర్సాలో టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు సంతానం, ప్రస్తుతం షాహినా మరలా గర్భవతి గా ఉంది. ఈ కారణంగా ఆమె కొద్ది రోజులుగా మదర్సా కి వెళ్లడం లేదు. అయితే శనివారం రాత్రి సులేమాన్ పెద్ద పిల్లలు ఇద్దరితో ఒక గదిలో పడుకోగా షాహినా చిన్నవాడైన ఆదిల్ తో మరో గదిలో పడుకుంది. తెల్లవారు జామున పిల్లవాడిని నిద్రలేపి బాత్ రూం లోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి చంపేసింది. అల్లా బలికోరాడు అని భావించిన ఆమె ఈ హత్య చేసినట్టు చెబుతున్నారు. కాసేపటికి తెలివి వచ్చి చేసిన తప్పు తెలుసుకుని స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది. పోలీసులు వచ్చేదాకా ఆమె గేటు దగ్గర నిలబడి వారి కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.

Related posts